వరద నష్టంపై అమిత్‌ షాకి నివేదిక.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సాయం: కేంద్రమంత్రి

64చూసినవారు
వరద నష్టంపై అమిత్‌ షాకి నివేదిక.. త్వరలోనే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సాయం: కేంద్రమంత్రి
ఏపీ, తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వరద నష్టంపై ప్రాథమిక నివేదిక రూపొందించి నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకి ఆ నివేదికను అందజేశారు. త్వరలోనే కేంద్ర బృందాలు వరద ప్రాంతాలను పరిశీలిస్తాయని, కేంద్రం నుంచి ఆర్థిక సాయం అందుతుందని శివరాజ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు.

సంబంధిత పోస్ట్