రోడ్డు ప్రమాదం.. సీనియర్ నటి పవిత్ర కన్నుమూత

77చూసినవారు
రోడ్డు ప్రమాదం.. సీనియర్ నటి పవిత్ర కన్నుమూత
తెలుగులో 'త్రినయని' సీరియల్ తో పాపులర్ అయిన కన్నడ నటి పవిత్రా జయరామ్ మృతి చెందారు. ఇవాళ తెల్లవారుజామున కర్నూలు సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారు బస్సును ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పవిత్ర స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. కన్నడలో 'రోబో ఫ్యామిలీ' అనే సీరియల్ తో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె తెలుగులో మొదటగా 'నిన్నేపెళ్లాడతా' అనే సీరియల్ లో నటించారు.