దేశ వ్యాప్తంగా ఐపీఎల్ హీట్ మొదలైంది. లీగ్లో అత్యధిక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మను తప్పించడం హాట్ టాపిక్గా మారింది. రోహిత్ కు ఐదు కప్పులు ఇచ్చి హార్దిక్ పాండ్యా చేతికి అందజేయడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ని ఎక్స్లో 4 లక్షల మంది, ఇన్స్టాగ్రామ్లో 5 లక్షల మంది అన్ఫాలో చేశారు. రోహిత్ని ముంబై వదిలేసిన తర్వాత వస్తున్న కొన్ని వార్తలు షాకింగ్గా ఉన్నాయి.