ఓటు వేయకపోతే రూ.350 ఫైన్.. క్లారిటీ

212640చూసినవారు
ఓటు వేయకపోతే రూ.350 ఫైన్.. క్లారిటీ
ఎన్నిక‌ల వేళ సోష‌ల్ మీడియాలో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. "లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌క‌పోతే ఓటర్లకు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ జ‌రిమానా విధిస్తుంది. ఓటు వేయ‌ని వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350లను డెబిట్ చేస్తుంది." అని ఆ వార్త సారాంశం. దీనిపై కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన PIB FACT CHECK స్పందిస్తూ.. ఈ వార్త అవాస్త‌వ‌మ‌ని వెల్ల‌డించింది. ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఇటువంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, ఫేక్ న్యూస్‌ని న‌మ్మొద్ద‌ని తెలిపింది.

సంబంధిత పోస్ట్