'చెత్త సేకరణకు గాడిదలు కావాలి.. టెండర్లకు రండి' అని రాజస్థాన్ లోని జోధ్పూర్ కార్పొరేషన్ పిలుపునిచ్చింది. జోధ్పూర్లోని కొన్ని ప్రాంతాలు ఇరుకుగా, ఎగుడుదిగుడుగా, వ్యాన్లు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో చెత్తను సేకరించేందుకు గాడిదలను ఉపయోగిస్తున్నారు. అధికారులు ఏటా గాడిదల కోసం రూ.60లక్షల విలువైన టెండర్ వేస్తున్నారు. ప్రస్తుతం రూ.65లక్షల టెండర్ కింద 65 గాడిదలను పనిలోకి దించారు.