జైపూర్లో ఆర్ఎస్ఎస్ నేత ఇంద్రేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కౌంటర్ ఇచ్చారు. ఆర్ఎస్ఎస్ ను ప్రధాని మోదీ కూడా సీరియస్గా తీసుకోవడం లేదన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ నేతల మాటలను తాము కూడా పట్టించుకోమని చెప్పారు. ఆయన అప్పట్లో ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే ప్రతి ఒక్కరూ వారిని పట్టించుకునే వాళ్లని తెలిపారు. కానీ అప్పుడు మౌనంగా ఉన్నారని విమర్శించారు.