ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రిలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ సర్జరీ తర్వాత వేగంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన ఆరోగ్య పరిస్థితిపై సద్గురు అప్డేట్ ఇచ్చారు. ఆస్పత్రి బెడ్పై తలకు బ్యాండేజ్తో ఎంతో కూల్గా న్యూస్ పేపర్ చదువుతున్న ఓ షార్ట్ వీడియో క్లిప్ను ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా షేర్ చేశారు.