ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో.. ఓ ప్రయాణికురాలికి క్షమాపణ చెప్పింది. శ్రాంఖ్లా అనే ప్రయాణికురాలు ఇటీవల ఇండిగో ఎయిర్లైన్స్లో ప్రయాణించారు. విమానం దిగిన తర్వాత చూస్తే తన సూట్కేసు పగిలిపోయి ఉంది. దీనికి సంబంధించిన ఫొటోలను ఎక్స్లో పంచుకొని.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి సమయం ఇవ్వండి. త్వరలో మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం’ అని ఇండిగో రిప్లై ఇచ్చింది.