పిడుగు పడి వ్యక్తి మృతి
పిడుగు పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన అందోల్ మండలం ఎర్రవరం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పాపయ్య (50) పశువులను మేపేందుకు గ్రామ శివారులోని పొలానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో పిడుగు పడి అక్కడికక్కడే మరణించాడు. అతనికి భార్య, కుమారుడు ఉన్నారు.