సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నుండి శ్రీ రామ భక్తులంతా అయోధ్య యాత్రకు వెళుతున్న సందర్భంగా భుధవారం రామ్ మందిర్ నుండి నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని రామ భక్తులకు రామకోటి సంచికలను ఓబీసీ మోర్చా రాష్ట్ర పూర్వాధ్యక్షులు ఆలె భాస్కర్ రాజ్ అందచేశారు. కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ రజనీకాంత్, ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, వివిధ మండలాల అధ్యక్షులు, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.