![రక్తదాన శిబిరానికి భారీ స్పందన రక్తదాన శిబిరానికి భారీ స్పందన](https://media.getlokalapp.com/cache/a6/95/a69565d3d651308bbafe6813ed2038e0.webp)
రక్తదాన శిబిరానికి భారీ స్పందన
కార్గిల్ విజయ్ దివస్ 25వ వార్షికోత్సవ సందర్బంగా నారాయణఖేడ్ బ్లడ్ డోనర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం నారాయణఖేడ్ లోని మహాలక్ష్మి ఆసుపత్రిలో నిర్వహించిన రక్తదాన శిబిరంకి భారీ స్పందన లభించింది. 50 మంది రక్తదానం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. పట్టణానికి చెందిన యూసుఫ్ అనే యువకుడు శుక్రవారం తన పుట్టినరోజు సందర్బంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమాన్ని సిఐ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఖేడ్ బ్లడ్ డోనర్స్ వ్యవస్థాపకులు ముజాహెద్ చిస్తీ, సభ్యులు ఓం ప్రకాష్, కోటారి నర్సింలు, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు