రోడ్డుకు మరమ్మతులు చేయించాలని డిమాండ్

62చూసినవారు
సదాశివపేట మండలం ఆత్మకూరు నుంచి మాలపాడు వరకు ఉన్న రోడ్డు అద్వానంగా మారిందని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ ఆరోపించారు. సదాశివపేటలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రోడ్డుపై గుంతలు ఉండడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. రోడ్డుకు మరమ్మత్తులు చేయించాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్