ఓపెన్ స్కూల్ పరీక్షల్లో పరిశీలించిన రాష్ట్ర స్థాయి బృందం
సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న ఓపెన్ స్కూల్ పరీక్షలను రాష్ట్రస్థాయి ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మంగళవారం పరిశీలించింది. సంగారెడ్డి లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, సెయింట్ జోసెఫ్ పాఠశాల, పటాన్ చెరులోని విద్యా భారతి పాఠశాలను సందర్శించారు. విద్యా భారతి పాఠశాలలో మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్న ఒక విద్యార్థిని డిబార్ చేశారు. వీరి వెంట డిఈఓ వెంకటేశ్వర్లు ఉన్నారు.