సంగారెడ్డి పట్టణంలోని చింతలపల్లి లో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ చౌహన్ సోమవారం పర్యటించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామం పక్కన మరుగు కాల్వ ఉండడంతో ఇళ్లలోకి నీరు వస్తుందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.