జహీరాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎంపీ సురేష్ షెట్కార్ అన్నారు. జహీరాబాద్ పట్టణంలో విజయోత్సవ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ తనను పార్లమెంట్ సభ్యునిగా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పారు. తన విజయానికి కష్టపడ్డ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.