పాక్‌లో షాంఘై సమ్మిట్.. హాజరుకానున్న 7 దేశాల ప్రధానులు

82చూసినవారు
పాక్‌లో షాంఘై సమ్మిట్.. హాజరుకానున్న 7 దేశాల ప్రధానులు
ఇస్లామాబాద్‌ వేదికగా షాంఘై సహకార సంఘం (SCO) వార్షిక సమావేశం ఈ నెల 15-16 తేదీల్లో జరగనుంది. చైనా, రష్యా, బెలారస్‌, కజకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లకు చెందిన ప్రధాన మంత్రులు ఈ కార్యక్రమానికి హజరుకానున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశానికి భారత్‌ తరఫున కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌ హాజరుకానున్నారు. ఈ మేరకు పాకిస్థాన్‌ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

సంబంధిత పోస్ట్