ఆస్ట్రేలియాతో మ్యాచ్లో టీమిండియాకు భారీ షాక్ తగిలింది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. హేజిల్వుడ్ వేసిన రెండో ఓవర్లో నాలుగో బంతికి టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చాడు. ఈ ఓవర్లో ఒకే పరుగు వచ్చింది. కాగా ప్రస్తుతం భారత స్కోరు 2 ఓవర్లకు 6/1. క్రీజులో రిషభ్ పంత్ (0), రోహిత్ (6) ఉన్నారు.