పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు

50106చూసినవారు
పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు
ఇటీవల రోజుల్లో బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరిన విషయం తెలిసిందే. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. దీంతో మునుపెన్నడూ లేని విధంగా రూ.75 వేల మార్క్‌కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.490 పెరిగి రూ.72,650కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.

ట్యాగ్స్ :