ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

50చూసినవారు
ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి
ఘోర రోడ్డు ప్రమాదం మంగళవారం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు. వల్లూరు నుంచి మక్కరాజుపేట వెళ్తున్న ఓ ఆటో చేగుంట మండలం రెడ్డిపల్లి 44వ జాతీయ రహదారిపై లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. వారంతా మక్కరాజుపేట గ్రామస్థులుగా సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్