ఓటు హక్కు వినియోగించుకున్న రఘునందన్ రావు

75చూసినవారు
అక్బర్ పేట భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ 17లో కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన రఘునందన్ రావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్