బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందించిన ఎమ్మెల్యే
![బాధిత కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందించిన ఎమ్మెల్యే](https://media.getlokalapp.com/cache/8b/f5/8bf50e79e196fb393f21f7c75982ddf8.webp)
దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త కాస కళ్యాణ్ కుమార్ ఇటీవల ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకొని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి బాధిత అండగా నిలిచి, బిఆర్ఎస్ పార్టీ క్రియాశీల సభ్యత్వం ఉన్నందున వారి కుటుంబ సభ్యులకు సోమవారం ప్రమాద బీమా కింద రెండు లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.