ప్రజావాణి అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పడు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అధికారులను ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ ఆర్జీలను స్వీకరించారు.