రేపు హుస్నాబాద్ లో విద్యుత్ అంతరాయం

73చూసినవారు
రేపు హుస్నాబాద్ లో విద్యుత్ అంతరాయం
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ 132/33 KV సబ్ స్టేషన్లో అత్యవసర పనులు కొరకు శుక్రవారం నాడు ఉదయం 09: 00 గంటల నుండి మధ్యాహ్నం 01: 00 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. మరమ్మతుల కారణంగా హుస్నాబాద్ మున్సిపాలిటీ, హుస్నాబాద్ మండలం, అక్కన్నపేట మండల పరిధిలో గల వినియోగదారులకు విద్యుత్ అంతరాయం కలుగుతుందని, అందరు గమనించి సహకరించగలరని కోరారు.

సంబంధిత పోస్ట్