హవేలిఘనపూర్ మండలం శమ్నాపూర్ గ్రామానికి చెందిన చింతల బూదమ్మ బావిలో దూకి శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న భూదమ్మ కొడుకులను ఇబ్బంది పెట్టవద్దని ఉద్దేశంతో బావిలో దూకింది. ఈ విషయం తెలియగానే ఆమె పెద్దకొడుకు బైరయ్య గుండెపోటుకు గురవడంతో.. ఏఎస్ఐ రాజు వెంటనే సీపీఆర్ చేయడంతో కోలుకున్నాడు. కొడుకును చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.