ఆందోలు గ్రామానికి చెందిన మల్లేశం రామాయంపేట మండలం కోనాపూర్ సమీపంలో శనివారం శవమై కనిపించాడు. మల్లేశంను శుక్రవారం రోజున కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు చర్యలు చేపట్టారు. రామయ్యపేట మండలం కోనాపూర్ శివారులో శవమై కనిపించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.