సిద్దిపేటలోని మార్కెట్ యార్డ్ లో తడిసిన ధాన్యం

56చూసినవారు
సిద్దిపేట నియోజకవర్గం, అకాల వర్షం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. రెండు రోజులుగా స్వల్పంగా మొదలై భారీగా కురుస్తున్న వానలు రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్లో విక్రయాలకు తెచ్చిన ధాన్యం తడిసింది. సకాలంలో కొనుగోలు చేయాలని శనివారం రైతులు అధికారులకు విన్నవిస్తున్నారు.