సిద్ధన్నపేటలో ముగ్గుల పోటీలు:

301చూసినవారు
సిద్ధన్నపేటలో ముగ్గుల పోటీలు:
సిద్దిపేట: నంగునూరు మండలంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సిద్దన్నపేటలో బుధవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. బాలికలు, మహిళలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో మొదటి బహుమతిని బెదురు మానస, ద్వితీయ బహుమతిని దామిడి సింధుజ, తృతీయ బహుమతిని స్వప్న కైవసం చేసుకున్నారు. విజేతలకు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, డాకూరి కనకవ్వ, డాకూరి భాస్కర్‌రెడ్డి, ఎంపీటీసీ బెదురు తిరుపతి, నాయకులు మల్లేశం, సంతోష్, జక్కిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, రాజు శేఖర్ రెడ్డి, గజల సతీష్ రెడ్డి, యాదగిరి, రమేష్, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :