ఊరకుక్కల దాడిలో జీవాలు మృతి
ఊరకుక్కల దాడిలో 48 మూగజీవాలు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన సోమవారం వర్గల్ మండలం అంబర్ పేటలో గ్రామం లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే అంబర్ పేట గ్రామానికి చెందిన గొర్రెల పెంపకందారుడు బండ సత్యనారాయణకు 150 దాకా గొర్రెలు ఉన్నాయి. జీవాలను కొట్టంలోకి పంపి భోజనం చేసేందుకు ఇంటికెళ్లాడు. వర్షం రావడం తో ఇంటి వద్ద ఉండి పోయాడు. రాత్రి కొట్టంపై ఊర కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో 48 గొర్రెలు మృత్యువాత పడ్డాయి.