నేడు తిరుమలకు ‘సిట్‌’ బృందం

81చూసినవారు
నేడు తిరుమలకు ‘సిట్‌’ బృందం
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ వ్యవహారంలో విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ఇవాళ మధ్యాహ్నం తిరుమలలో పర్యటించనుంది. సిట్‌ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో బృంద సభ్యులు తిరుమలలో పర్యటించనున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్‌ అధికారులు సమావేశం కానున్నారు.

సంబంధిత పోస్ట్