లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

84చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
వరుసగా రెండో రోజూ దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 282.88 పాయింట్లు లాభపడి 64,363.78 వద్ద, నిఫ్టీ 97.30 పాయింట్లు పెరిగి 19,230.60 వద్దకు చేరుకున్నాయి. అపోలో హాస్పిటల్స్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, టైటాన్ కంపెనీల షేర్లు లాభాలను ఆర్జించాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, SBI లైఫ్ ఇన్సూరెన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు నష్టపోయాయి.