భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

53చూసినవారు
భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ కుదుపునకు లోనయ్యాయి. బుధవారం ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌.. 11 గంటల తర్వాత భారీ నష్టాల్లోకి జారుకుంది. ఇంట్రాడేలో 72,515.71 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 906.07 పాయింట్ల నష్టంతో 72,761.89 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 338 పాయింట్లు నష్టంతో 21,997.70 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.85గా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్