భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

52చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1,240.90 పాయింట్లు పెరిగి 71,941.57 వద్ద, నిఫ్టీ 385.00 పాయింట్లు లాభపడి 21,737.60 వద్ద ఉన్నాయి. నిఫ్టీలో ONGC, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్ లాభపడగా, సిప్లా, ITC, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.14 వద్ద స్థిరంగా ముగిసింది.