నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

64చూసినవారు
నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ 182 పాయింట్ల నష్టంతో 80,533 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 67 పాయింట్లు కోల్పోయి 24,546 వద్ద ట్రేడవుతోంది. ఇక సెన్సెక్స్ సూచిలో యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, TCS, భారతీ ఎయిర్‌టెల్, HCL షేర్లు లాభాల్లో ఉండగా, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, NTPC, అల్ట్రాటెక్ సిమెంట్, HDFC, కోటక్ మహింద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్