లోక్సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల నేతలపై దాడులు జరుగుతున్నాయి. యూపీలోని ముజఫర్నగర్లో కేంద్రమంత్రి సంజీవ్ బల్యాన్ కాన్వాయ్పై రాళ్లదాడి మరువక ముందే మరో దాడి జరిగింది. తాజాగా పశ్చిమబెంగాల్ మంత్రి ఉదయన్ వాహనంపై దుండగులు దాడి చేశారు. కూచ్ బెహార్ ప్రాంతంలో ఆయన కాన్వాయ్లోని వాహనంపై రాళ్ల దాడి చేసి, అద్దాలను ధ్వంసం చేశారు. బీజేపీ నేతలు ఈ దాడి చేసినట్లు TMC ఆరోపించింది.