ఏటీఎంలో సూట్‌కేసు.. బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

572చూసినవారు
ఏలూరు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం వద్ద సూట్‌కేసు కలకలం రేపింది. బాంబు భయంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసుల బాంబ్ స్క్వాడ్ సిబ్బందితో ఏలూరులోని పీఎన్‌బీ ఏటీఎం వ‌ద్ద‌కు చేరుకున్నారు. అయితే సూట్‌కేసును క్షుణంగా ప‌రిశీలించిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది అందులో ఎటువంటి ప్ర‌మాద‌క‌మైన వస్తువులు లేవ‌ని తెలిపారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్