నవయుగ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడని అనంతగిరి మండలం త్రిపురవరం నవయుగ యూత్ సభ్యులు కొనియాడారు. ఆదివారం అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. ఆయనలోని నాయకత్వ లక్షణాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.