May 12, 2024, 06:05 IST/సూర్యాపేట నియోజకవర్గం
సూర్యాపేట నియోజకవర్గం
ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం
May 12, 2024, 06:05 IST
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక పిల్లలమర్రి గ్రామంలోని చారిత్రాత్మకమైన 12వ శతాబ్దానికి చెందిన కాకతీయుల కాలంనాటి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు ఆదివారం ఆరుద్ర నక్షత్రం మహా పర్వదిన సందర్భంగా ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం పరమ శివుడు భక్తులకు దివ్యదర్శనంలో దర్శనమిచ్చారు. పిల్లలమర్రి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.