ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వల్లాపురం విద్యార్థి

568చూసినవారు
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన వల్లాపురం విద్యార్థి
ఇంటర్మీడియట్ ప్రకటించిన పరీక్షా ఫలితాలలో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన అర్వపల్లి నాగరాజు ఎంపీసీ విభాగంలో సత్తా చాటాడు. నాగరాజు 470 మార్కులకు 462 సాధించడం పట్ల వారి తల్లిదండ్రులు అర్వపల్లి హనుమంతరావు బాగ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి మంచి పేరు తీసుకువచ్చిన నాగరాజుకు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

ట్యాగ్స్ :