
మునగాల: అర్హులందరికి రాజీవ్ యువ వికాసం రుణాలు మంజూరు చేయాలి
రాజీవ్ యువ వికాసం సబ్సిడీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులందరికి రుణాలు మంజూరు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పొనుగోటి రంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రుణాల మంజూరు కోసం విధించిన నిబంధనలను వెంటనే విరమించుకోవాలని బుధవారం మునగాల మండల కేంద్రంలో ఆయన ఒక ప్రకటనలో సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.