రైతుల ప్రయోజనాలే సహకార సంఘ లక్ష్యమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి అన్నారు. సోమవారం కోదాడ సొసైటీలో రైతులకు దీర్ఘకాలిక రుణాలను పంపిణీ చేసి మాట్లాడారు. కోదాడ సొసైటీ అభివృద్ధికి పాలకవర్గం చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. సొసైటీ ఛైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. 15 మంది సభ్యులకు దీర్ఘకాలిక రుణాల్లో భాగంగా 45 లక్షల రూపాయలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నరేష్ సభ్యులు ఉన్నారు.