న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చిన సుంకర చంద్రయ్య

68చూసినవారు
న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చిన సుంకర చంద్రయ్య
మునగాల మండలం విజయరామపురం గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయవాది సుంకర చంద్రయ్య మృతి బాధాకరమని మానవహక్కుల సంఘం రాష్ట్ర మాజీ చైర్మన్ జస్టిస్ జి చంద్రయ్య అన్నారు. సోమవారం విజయరామపురంలో న్యాయవాది చంద్రయ్య సంతాప సభలో ఆయన మాట్లాడారు. చంద్రయ్య న్యాయవాద వృత్తికి వన్నె తెచ్చారని ఆయన సేవలు స్మరించారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులు సుంకర శ్రీనివాస్ మధు, బుర్రి శ్రీరాములు ఉన్నారు.