ప్రమాదవశాత్తు చెరువులో పడి రైతు మృతి చెందిన సంఘటన మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రిలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు దాసరి మల్లయ్య(60) వ్యవసాయ పనులు ముగియడంతో గత కొన్ని రోజులుగా గేదెలను కాస్తున్నాడు. ఆదివారం చెరువు సమీపంలో గేదెలు కాస్తున్న క్రమంలో చెరువులో దిగిన గేదెలను బయటకు తరలించే ప్రయత్నంలో చెరువులోకి దిగి మృతి చెందినట్లు తెలిపారు.