టీ20 వరల్డ్ కప్లో ఫిక్సింగ్ కలకలం రేగింది. తనను కొంతమంది బుకీలు సంప్రదించారని ఓ ఉగాండా ప్లేయర్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కెన్యాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ పదే పదే ఫోన్లు చేసినట్లు ఆయన ఐసీసీకి సమాచారమిచ్చారు. దీనిపై ఐసీసీ యాంటీ కరప్షన్ యూనిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 వరల్డ్ కప్కు ఉగాండా అర్హత సాధించడం ఇదే తొలిసారి. నాలుగు మ్యాచ్లు ఆడి ఒకే ఒక్క దాంట్లో గెలిచింది.