విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు

563చూసినవారు
విద్యార్థికి రూ.46 కోట్ల పన్ను నోటీసులు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కు చెందిన ఓ విద్యార్థికి జీఎస్టీ అధికారులు రూ.46 కోట్ల లావాదేవీలపై పన్ను కట్టాలంటూ నోటీసులు పంపారు. ఈ నోటీసులు చూసి షాకైనా విద్యార్థి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో 2021లో ఆ విద్యార్థి పాన్‌కార్డ్‌ నెంబర్‌తో ఎవరో ఒక కంపెనీ ప్రారంభించి, అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి కోట్లలో లావాదేవీలు జరిపారని దీనిపై దర్యాప్తు జరుగుతుందని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :