కోనసీమలోని జగ్గన్నపేటలో వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల కోసం జూనియర్ ఎన్టీఆర్ రూ.12.50 లక్షల విరాళం ఇచ్చిన విషయం తెలిసిందే. ఎందుకు అంత విరాళం ఇచ్చానే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. అయితే ఈ చర్చలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటికొచ్చింది. అక్కడ పనిచేసే పురోహితుడు కారుపాటి కోటేశ్వరరావు తారక్ పెళ్లి చేసినట్లు సమాచారం. ఆయన కోరిక మేరకే విరాళం ఇచ్చారని తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్టీఆర్ తల్లి షాలిని, సోదరుడు కల్యాణ్ రామ్ తరుచూ ఆ ఆలయాన్ని సందర్శిస్తారట.