తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఎన్నికల కమిషన్ అనుమతి రానందున మంత్రవర్గ భేటీ వాయిదా పడింది. ఈసీ స్పందన రాకపోవడంతో సచివాలయం నుంచి సీఎం, మంత్రులు వెళ్లిపోయారు. ఈసీ అనుమతి వచ్చినప్పుడే కేబినెట్ భేటీ జరపాలని సీఎం నిర్ణయించారు. ఎల్లుండిలోపు ఈసీ అనుమతి రాకపోతే దిల్లీకి వెళ్లాలని నిర్ణయించారు.