కోల్కతాతో మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తమ ఓటమికి గల కారణాలు వివరించాడు. గొప్ప ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడమే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు. ''ఇది చాలా కఠినమైనది. ఛేదనలో మాకు శుభారంభం దక్కింది. కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. వికెట్ భిన్నమైనది. ఇక్కడ బ్యాటింగ్లో జోరు అందుకోవడం చాలా ముఖ్యం. అది ఛేదించగలిగే లక్ష్యమే. బౌలర్లు గొప్పగా పోరాడారు'' అని వివరించాడు.