బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి మృతి!

77చూసినవారు
బావిలోకి దూసుకెళ్లిన కారు.. ఏడుగురి మృతి!
మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. పండర్‌పుర్‌ పుణ్యక్షేత్రం నుంచి తిరుగు ప్రయాణంలో దుర్ఘటన చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్