అతివేగం అమాయకురాలైన ఓ మహిళ ప్రాణం తీసింది. వేగంగా దూసుకొచ్చిన కారు.. సరోజ్ అనే మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన ఇవాళ ఉదయం.. గురుగ్రామ్లోని సైక్బర్ సిటీలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే.. డ్రైవర్ కారు ఘటనాస్థలిలోనే ఉంచి పారిపోయాడు. సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.