వినియోగదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్న్యూస్ చెప్పింది. SBIలోని స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు మార్చి 31తో ముగియగా.. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు గడువు పెంచింది. ఈ స్కీమ్ కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది.