‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు

145091చూసినవారు
‘అమృత్‌ కలశ్‌’ గడువు మరోసారి పెంపు
వినియోగదారులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. SBIలోని స్పెషల్‌ డిపాజిట్‌ స్కీమ్‌ ‘అమృత్‌ కలశ్‌’ పథకం గడువును మరోసారి పొడిగించింది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు మార్చి 31తో ముగియగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు గడువు పెంచింది. ఈ స్కీమ్‌ కింద సీనియర్‌ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్